‘పవన్’కు బడా నిర్మాత షాక్!

Advertisement

టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతల్లో ఒకరైన బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఎన్నో, ఎన్నెన్నో హిట్ సినిమాలు తీశారు. అయితే ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఒక్క అత్తారింటికి దారెది సినిమా మాత్రం ఆయన కరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఆ సినిమా అంతటి హిట్స్ అయినప్పటికీ ఆ సినిమాకు సంభందించి రెమ్యునిరేషన్ విషయంలో నిర్మాత మోసం చేసాడని త్రివిక్రమ్ పవన్, ఇద్దరు నిర్మాతల మండలిని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యవహారం సర్దుమణిగిందో లేదో తెలీదు కానీ, ఇప్పుడు బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా హిట్ తో మాత్రం మరో వివాదానికి తెర తీశాడు మన నిర్మాత. సుకుమార్ కు ప్రేమతో కొని ఇచ్చిన కారు ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ తే టౌన్ గా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే…పవన్ కు ముట్టవలసిన పారితోషికం ఇంకా ఈ నిర్మాత పూర్తిగా క్లియర్ చేసాడో లేదో అన్న గాసిప్పులు ఇంకా హడావిడి చేస్తూ ఉండగానే తన బ్యానర్ లో నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ డైరెక్ట్ చేసిన సుకుమార్ కు రీసెంట్ గా లగ్జరీ కార్ గిఫ్ట్ ఇవ్వడం ఒక విధంగా పవన్ కు కౌంటర్ ఇచ్చినట్లే అన్న వాదన బలంగా వినిపిస్తుంది. అదే క్రమంలో నాన్నకు ప్రేమతో సినిమాతో పోలిస్తే అత్తారింటికి దారెది సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది, కానీ వారికి ఇంకా మ్యాటర్ సెటిల్ చెయ్యకుండా ఈ లగ్జరీ కారు గిఫ్ట్ అంత సడన్ గా ఎందుకు ఇచ్చినట్లు అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news