Meena: వైరల్ అవుతున్న ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

  • May 28, 2024 / 12:45 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో మీనా (Meena) ఒకరు కాగా ఈ మధ్య కాలంలో దృశ్యం సిరీస్ సినిమాలు మీనాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనా తనపై వచ్చే విమర్శలకు బదులిచ్చే విషయంలో ముందువరసలో ఉంటారు. ఒక నిర్మాత మీనా, ఆమె తల్లి నాతో దురుసుగా ప్రవర్తించారంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. మాణిక్యం నారాయణన్ అనే ప్రముఖ నిర్మాత ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఒక ప్రోగ్రామ్ చేయాలని మీనా దగ్గరకు వెళ్లానని కానీ ఆమె నుంచి సరైన స్పందన రాలేదని మాణిక్యం అన్నారు. మీనానే కాదని మీనా తల్లి కూడా నాతో దురుసుగా మాట్లాడారని మాణిక్యం చెప్పుకొచ్చారు. నాలాంటి నిర్మాతలే కదా మీ సినిమాలకు కావాల్సింది? నన్ను పట్టుకుని చీప్ గా మాట్లాడతారా? అని అనిపించిందని ఆ సమయంలో చాలా బాధేసిందని మాణిక్యం వెల్లడించారు. ఈ అనుభవంతో ఇంకెప్పుడూ ఎవరినీ ఏదీ అడగకూడదని నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు.

సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖ సీనియర్ హీరోయిన్లు నాకు స్నేహితులే అని మాణిక్యం తెలిపారు. నా కొడుకు పెళ్లికి రోజా (Roja), సుహాసిని (Suhasini Maniratnam) , ఖుష్బూ (Khushbu Sundar) మరి కొందరు హీరోయిన్లు వచ్చారని మాణిక్యం వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే ఉండటం నయం అని ఆయన తెలిపారు.

మాణిక్యం వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా మీనా వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. మీనా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. తన సినీ కెరీర్ లో మీనా వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ ను కొనసాగించారు. మీనా గురించి ఒక నిర్మాత ఇలాంటి కామెంట్లు చేయడం అభిమానులకు సైతం షాకిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags