మహేష్ తో మూవీ గురించి చెప్పిన పూరి జగన్నాథ్

  • March 28, 2017 / 02:53 PM IST

స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. కొత్త తారలతో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. ఇజం తరువాత ఆయన రూపొందించిన మూవీ రోగ్‌’. ఇషాన్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. రోగ్‌ సినిమా విశేషాలతో పాటు తర్వాత చేయనున్న సినిమాల గురించి అనేక సంగతులు ముచ్చటించారు. ప్రస్తుతం బాలకృష్ణతో తీస్తున్న సినిమాలో గ్యాంగ్ స్టర్ గా బాలయ్య కనిపించనున్నారని వివరించారు. తన అభిమాన హీరో  చిరంజీవితో ఎప్పటికైనా సినిమా తీస్తానని స్పష్టం చేశారు. ‘జనగణమన’ కథని మహేష్‌కి చెప్పారు కదా, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అని విలేఖరులు అడగగా, అందుకు ఆయన స్పందిస్తూ .. “దేశానికి సంబంధించిన కథ అది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఎప్పుడనేది చెప్పలేను కానీ, ఆ సినిమా ఉంటుంది.” అని వెల్లడించారు. ఇప్పుడు ద్విభాషా చిత్రాలు చేయడానికి ప్రిన్స్ ఆసక్తి కనబరుస్తున్నందున .. ‘జనగణమన కూడా రెండు, మూడు భాషల్లో నిర్మితమవుతుందన్నారు. స్వయంగా పూరి మహేష్ చిత్రంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషపడ్డారు. పోకిరి, బిజినెస్ మ్యాన్ తరహాలో “జనగణమన” కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus