పూరీ మళ్ళీ మొదలెట్టాడు!

  • November 29, 2016 / 01:30 PM IST

“ఫాస్టెస్ట్ మూవీ మేకర్” అనే అవార్డ్ గనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే అది తప్పకుండా పూరీ జగన్నాధ్ నే వరిస్తుంది. బాబుగారు సినిమాలు ఒప్పుకోవడంలోనే కాదు ఆ సినిమాల షూటింగ్ ను పూర్తి చేసి ఫస్ట్ కాపీని ప్రొడ్యూసర్ల చేతిలో పడేస్తుంటాడు. అందుకే ఆయన కెరీర్ లో హండ్రెడ్ స్ట్రయిక్ రేట్ లేకపోయినా.. ప్రొడ్యూసర్స్ మాత్రం ఆయన వెంబడుతుంటారు. పూరీ జగన్నాధ్ మొన్నామధ్య అదే రాకెట్ స్పీడ్ తో ఓ ప్రముఖ నిర్మాత కొడుకు హీరోగా కన్నడలో “రోగ్” అనే సినిమా మొదలెట్టాడు. మన్నారా చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నాలుగు నెలల క్రితమే మొదలైంది.

అయితే.. కారణాంతరాల వలన మధ్యలో ఆగిపోయింది. ఇంకా 30% షూటింగ్ పార్ట్ మాత్రమే మిగిలింది. మధ్యలో పూరీ హైద్రాబాద్ వచ్చేయడం, నిర్మాత కూడా ఫైనాన్షియల్ గా కాస్త వీక్ గా ఉండడం వల్ల కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను మళ్ళీ మొదలెట్టి.. మిగిలిన పార్ట్ ను త్వరలోనే పూర్తి చేసి ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని కన్నడతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలే “ఇజం”తో ఢీలాపడిన పూరీ “రోగ్”తోనైనా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus