పూరి జగన్నాథ కొడుకు ఆకాష్ చేయబోయే స్టోరీ లైన్ ఏంటంటే?

  • September 6, 2017 / 01:07 PM IST

డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా విజయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా బాలకృష్ణ తో చేసిన పైసావసూల్ కూడా అతనికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇప్పటికే స్టార్ హీరోలు పూరీని పక్కన పెడుతున్నారు. తాజా ఫెయిల్ తో హీరోలు డేట్స్ ఇవ్వడం కష్టమేనంటున్నారు టాలీవుడ్ వర్గాల వారు. అందుకే అతని తనయుడు ఆకాష్ ని హీరోగా రీలాంచ్ చేసే పనిలో పూరి పడ్డారని తెలిసింది. ఆకాష్ చిన్నప్పటి నుంచి సినీ రంగానికి చాలా దగ్గరగా ఉన్నారు. బాలనటుడిగానే కాకుండా ఆంధ్ర పోరి సినిమాలోనూ హీరోగా నటించారు. అయితే అది విజయం సాధించలేదు. సో హీరోగా నిలబెట్టాలని పూరి సంకల్పించుకున్నారు.

తనకి అచొచ్చిన ప్రేమకథనే ఎంచుకున్నట్టు తెలిసింది. స్వయంగా నిర్మించనున్న ఈ సినిమా స్టోరీలైన్ బయటికి వచ్చింది. తెలుగు అబ్బాయికి .. పాకిస్థాన్ కి చెందిన ముస్లిం అమ్మాయికి మధ్య ప్రేమను వెండితెరపై చూపించున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ లైన్ నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా స్క్రిప్ట్ రాసే పనిలో పూరి బిజీగా ఉన్నట్లు తెలిసింది. మరి ఈ సినిమా తండ్రి కొడుకులకు మంచి విజయాన్ని అందిస్తుందో? లేదో? చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus