మెసేజ్ ఇచ్చిన రాశీ ఖన్నా..!

  • July 25, 2019 / 05:36 PM IST

‘విమర్శించే వాళ్ళుండటం మంచిదే! అలా అన్ని విమర్శలు ఎదురైనప్పుడు.. కోపంతో ఊగిపోయి సహనం కోల్పోతే గొడవలే జరుగుతాయి. అదే విమర్శని పాజిటివ్ గా తీసుకుని.. దాన్ని సహజంగా సరిచేసి చూపిస్తే.. ‘ ఆ కిక్కే వేరంటుంది రాశీఖన్నా. ఇప్పుడు సౌత్ లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూనే… ‘వెంకీమామ’ ‘ప్రతీ రోజు పండగే’ అనే తెలుగు సినిమాలు కూడా చేస్తుంది రాశీ ఖన్నా. ఇక విషయం ఏమిటంటే.. గతంలో ఓ తెలుగు సినిమా కోసం ఈత దస్తులు ధరించి ఫోటోషూట్లో పాల్గొంది రాశీఖన్నా. ఆ సమయంలో కాస్త బొద్దుగా ఉండేది ఈ అమ్మడు. అయితే ఫోటోలు చూసిన ఆ వ్యక్తి.. ‘రాశీ నీకీ ఈత దుస్తులు అవసరమా అంటూ కామెంట్ చేసాడట.

దీంతో ఆ వ్యక్తి పై విరుచుకు పడకుండా.. ఆ విమర్శను ఛాలెంజ్‌గా తీసుకుని కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైందట. ఈ విషయాన్ని రాశీ ఖన్నా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతటితో అయిపోలేదు.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రంలో ‘నా అందం చూడవయ్యా’ అని ఆ అభిమానికి సమాధానమిచిందట. కాబట్టి రాశీ ఖన్నాలా విమర్శలను ఛాలెంజింగ్ గా తీసుకుంటే.. ప్రతీ ఒక్కరూ ఉన్నత స్థానంలో ఉంటారనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus