రాధాకృష్ణ, ప్రభాస్ మూవీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే ?

  • April 26, 2018 / 05:45 AM IST

యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో సాగుతోంది. నలభై రోజుల ఈ భారీ షెడ్యూల్ పూర్తి అయితే సినిమాలో మేజర్ పార్ట్ పూర్తి అయినట్లే. దానికి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ జోడించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ గ్యాప్ లో మరో సినిమాని పట్టాలెక్కించడానికి ప్రభాస్ డిసైడ్ అయ్యారు. అందుకే జిల్ ఫేమ్ రాధాకృష్ణ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాకి  ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఈ మూవీ టెక్నీషియన్లు, ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నారు.

జిగేల్ రాణి పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ కి జోడీగా నటించనుంది. అలాగే ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నారు. ఈయన గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు. ప్రభాస్ 20 వ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. తెలుగుతో పాటు తమిళంలో రూపుదిద్దుకోనున్న ఈ మూవీకి షూటింగ్ డేట్ ఫిక్స్ చేశారు. జూలై 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ఈ మొదలవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus