సౌందర్య బయోపిక్ తీసేందుకు మొదలైన పనులు

  • May 17, 2018 / 03:03 PM IST

ఎక్స్  పోజింగ్ కి దూరంగా ఉంటూ, విజయాలకు దగ్గరగా ఉంటూ 12  ఏళ్ల పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిన నటి సౌందర్య. అమ్మోరు, పవిత్రబంధం, రాజా, అన్నయ్య వంటి ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఆమె 2004 ఏప్రిల్ 17 న ఎన్నికల ప్రచారం నిమిత్తం విమానంలో ప్రయాణిస్తూ ప్రమాదంలో మరణించారు.  సౌందర్య మరణానంతరం బయోపిక్ మాట వచ్చినప్పటికీ .. కలక్షన్స్ రాదేమోనని ఆ జోలికి వెళ్ళలేదు. తాజాగా సావిత్రి బయోపిక్ మూవీ మహానటి కలక్షన్స్ చూసి అందరికీ బయోపిక్ లపై నమ్మకం కలుగుతోంది.

బాలీవుడ్ వారు శ్రీదేవి బయోపిక్ కోసం అడుగులు వేస్తుంటే.. తమిళ సినీ ప్రముఖులు జయలలిత బయోపిక్ తీయాలని కలానికి పదునుపెడుతున్నారు. టాలీవుడ్ లో అయితే ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ పూర్తి చేసుకొని మే 28 న సెట్స్ మెడకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక మహానటి ప్రభావంతో తేజ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ కోసం పనులు మొదలెట్టారు. “కాబోయే అల్లుడు ” అని పేరు కూడా రిజిస్టర్ చేసి ఆసక్తి రేకెత్తించారు. ఇక తాజాగా సౌందర్య బయోపిక్ తెరపైకి వచ్చింది. ఆమె బయోపిక్ ని నిర్మించేందుకు పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఉత్సాహంగా ఉన్నారు.  ఆమె జీవితాన్ని చక్కగా చూపించగలిగే దర్శకుని కోసం వెతుకుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. రేపో మాపో ఈ బయోపిక్ గురించి అధికార ప్రకటన రావచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus