సినిమాపై అంచనాలు పెంచుతున్న ఎస్.ఎస్. రాజమౌళి

  • September 17, 2016 / 10:13 AM IST

హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న సహజ నటుడు నాని “మజ్ను”తో మరోసారి నవ్వించడానికి సిద్ధమయిపోయాడు. ఉయ్యాలా జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కనిపించనున్నారు. అతనికి అసిస్టెంట్ డైరక్టర్ పాత్రను నాని పోషిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్లు హైలెట్ కానున్నాయని తాజా సమాచారం. సినిమా సెకండాఫ్ లో వచ్చే ఈ సన్నివేశాలు చక్కగా వచ్చాయని చిత్ర బృందం తెలిపింది.

“మజ్ను”లో రాజమౌళి నటిస్తున్నాడని వార్త బయటికి రాగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి. బాహుబలి షూటింగ్ దశలో జరిగే కథగా దీనిని పరిశ్రమ వర్గాల వారు డిసైడ్ చేశారు. నాని మజ్ను సినిమా ట్రైలర్ లో భల్లాలదేవుడి రథాన్ని తోలుతుండడం, రాజమౌళి మెగా ఫోన్ తో యాక్షన్ అని చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. రాజమౌళి గురించి మజ్ను బృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని నాని, దర్శకధీరుడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ బ్యానర్లో జెమినీ కిరణ్ నిర్మించిన ఏ సినిమా సెప్టెంబర్  23 న రిలీజ్ కానుంది. అయితే రాజమౌళి నటనా ప్రతిభను చూడాలంటే మరో వారం రోజులు ఆగాలన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus