త్రి భాషా చిత్రాన్ని తెరకెక్కించనున్న రాజమౌళి!

  • September 28, 2017 / 07:08 AM IST

బాహుబలి తర్వాత రాజమౌళి చేసే ప్రాజక్ట్ పై భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఎవరితో సినిమా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అని కొంతమంది పేర్లు వినిపించాయి. తాజాగా తమిళ హీరో ధనుష్ పేరు బయటికి వచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  దానయ్య ఈ మూవీని ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి నిర్మించనున్నట్లు తెలిసింది. రజనీకాంత్, రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఉంది.

వారిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించనట్టూ రజనీ అల్లుడితో మూవీ ఒకే చేశారు. ధనుష్ కి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. బాలీవుడ్ లోను మార్కెట్ పెంచుకోవాలని ధనుష్ రాజమౌళితో  త్రి భాష చిత్రానికి ఒకే చెప్పారు. ఈ చిత్రానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్యానల్ కాగానే అధికారిక ప్రకటన ఉంటుందని తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus