‘ఆర్.ఆర్.ఆర్’ కు రాజమౌళి కొత్త స్కెచ్!

  • December 5, 2018 / 07:55 AM IST

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి దర్శకత్వం లో తెరకేక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ విపరీతమైన హైప్ ఏర్పడింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.

తాజా షెడ్యూల్ లో యుద్ధం ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నట్టు టాక్. అప్పుడే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకోబోతుండటం విశేషం.
రాజమౌళి ఇంత వేగంగా చిత్రీకరణ జరపడం ఇదే మొదటిసారి అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. అయితే తాజాగా విడుదలైన ‘2.0’ చిత్రం పబ్లిసిటీ లేక వసూళ్ళు తగ్గాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్న తరుణంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి పబ్లిసిటీ గాట్టిగా చేయాలని దర్శకుడు రాజమౌళి అలాగే నిర్మాత డి.వి.వి దానయ్య భావిస్తున్నారట. ప్రతీ రోజు ఏదో ఒక న్యూస్ ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus