వెంకటేష్, నాగచైతన్య సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్

Ad not loaded.

తెలుగులో మంచి విజయాలు అందుకున్న ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా తమిళంలో సినిమాలకు సంతకం చేసింది. కార్తి, శివకార్తికేయన్‌ సినిమాలలో జోడిగా నటిస్తోంది. సూర్య పక్కన కూడా నటిస్తోంది. ఇక కోలీవుడ్ లో రకుల్ స్థిరపడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తనకు మంచి గుర్తింపును ఇచ్చిన టాలీవుడ్ ని ఆమె వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే కొత్తగా తెలుగు సినిమాకి సైన్ చేసింది. జై లవకుశ తర్వాత బాబీ వెంకటేష్, నాగచైతన్యలతో ఓ మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారు. ఈ మూవీలో నాగచైతన్యకి జోడీగా రకుల్ ని తీసుకున్నారు.

వీరిద్దరూ రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో కలిసి నటించారు. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుండడంతో మళ్ళీ ఆ జోడీని వెండితెరపై చూపించడానికి సిద్ధమయ్యారు. ఇక నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి మూవీ చేస్తున్నారు. ఇది షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత మారుతీ దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు మూవీని కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత బాబీ ప్రాజక్ట్ పట్టాలెక్కించనున్నారు. అంతలోకే వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో f2 చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ప్రేమమ్ సినిమాలో వెంకీ కాసేపు కనిపించి విజిల్స్ వేయించారు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరూ కలిసి రెండున్నర గంటల సేపు వినోదాన్ని పంచనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus