అక్షయ్ కుమార్ కోసం రకుల్ సినిమా పోస్ట్ పోన్!

  • February 6, 2018 / 05:31 AM IST

పాపం రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో సరైన అవకాశాలు లేకపోయినా బాలీవుడ్ మీద బోలెడు ఆశలు పెట్టుకొంది. అక్కడ “అయ్యారి” అనే చిత్రంలో నటించిన రకుల్ తాజాగా అజయ్ దేవగన్ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని సైతం సొంతం చేసుకొంది. “అయ్యారి” రిలీజైతే తనకి బాలీవుడ్ లో ఆఫర్లు తెలుగులోవలే వెల్లువెత్తకపోయినా.. కనీసం ఒక రెండు మూడు ఆఫర్లైనా వస్తాయి అనుకొంది. అయితే… ఆమె అదృష్టం బాలేదో తెలియదు కానీ ఆమె బాలీవుడ్ చిత్రం “అయ్యారి” పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.

ముందు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేద్దామనుకొన్నారు. కానీ ఆ సమయానికి “పద్మావతి” రిలీజ్ ఉండడంతో ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడేమో “అయ్యారి” దర్శకుడి చిరకాల మిత్రుడు అక్షయ్ కుమార్ తన “ప్యాడ్ మ్యాన్” చిత్రాన్ని ఫిబ్రవరి 9కి విడుదల చేస్తుండడంతో.. “అయ్యారి” మళ్ళీ ఫిబ్రవరి 16కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు కూడా ఫిబ్రవరి 16 అనేది ఫిక్స్ అవ్వలేదు. మార్చికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో తన హిందీ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియక కన్ఫ్యూజన్ లో ఉంది. తెలుగులో సరైన అవకాశాలు రాక, హిందీ సినిమా రిలీజవ్వక, మీడియాలో కష్టాల్లో రకుల్ కెరీర్ అని వస్తున్న కథనాలు భరించలేక చాలా ఇబ్బందిపడుతుందట రకుల్ ప్రీత్ సింగ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus