ప్రయోగం వద్దనుకున్న చెర్రీ!!!

  • December 10, 2016 / 06:04 AM IST

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ తాజా సినిమా ధృవ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అందరూ ఊహించినట్లుగానే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది….అదే క్రమంలో ఈ సినిమాలో విలన్ పాత్ర అందరినీ కట్టి పడేసింది…అయితే సహజంగా మన సినిమాల్లో కామెడీ లేకపోతే అస్సలు నడవదు…అందుకే మన దర్శకులు ఇరికించి మరీ కామెడీ పెడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎలాంటి కామెడీ లేదు….అదేంటి అని చెర్రీని అడిగితే…కావాలనే ప్రయోగం చెయ్యలేదు….అని అంటున్నాడు…విషయం ఏమిటంటే….ఈ సినిమా గురించి చేర్రీని అడగగా….తాను ఏమంటున్నాడు అంటే…ఈ సినిమా అంతా…హీరో- విలన్ మధ్య మైండ్ గేమ్ కాన్సెప్ట్ బేస్డ్ గా  నడుస్తుంది.

ఈ సినిమా కోసం అనవసరపు హంగామాని అస్సలు ఎంటర్టైన్ చేయలేదు. సీన్స్ అయినా.. సాంగ్సైనా సిట్యువేషనల్ గా వచ్చేవే తప్ప కమర్షియల్ టచ్ ఇద్దామని ఆలోచించి హిట్ కోసం ఫార్ములా లెక్క వేసుకోలేదు. అనవసరమైన హంగామా చేస్తే…సినిమా ఒరిజినల్ ఫ్లెవర్ మిస్ అవుతుంది అని, అలా చెయ్యాల్సి వచ్చింది అంటున్నాడు చెర్రీ….అంతేకాదు….కామెడీ గురించి కూడా…మాస్ ఇమేజ్ ఉన్న మీ లాంటి స్టార్ హీరో సినిమాల్లో కామెడీ లేకపోతే ఎలా? అంటే.. కామెడీ ఏమీ హిట్ ఫార్ములా కాదని సింపుల్ గా తేల్చేశాడు. అదే క్రమంలో భారీ సినిమాలయ్ అయినటువంటి…సింహా, మగధీర, సరైనోడు, బాహుబలి లాంటి సినిమాలు కామెడీ లేకుండా హిట్ కాలేదా….అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు కూడా…..మొత్తానికి తమిళ సినిమాని తెలుగులో కాపీ పేస్ట్ చేశానని ఒప్పుకోకనే ఒప్పెసుకుంటున్నాడు మన చెర్రీ..ఏమైనా…సినిమా సూపర్ హిట్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు…..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus