మహేష్ కి కొత్త లక్ష్యాన్నిచ్చిన రామ్ చరణ్.!

  • April 15, 2018 / 07:55 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక కలక్షన్స్ సాధించిన జాబితాలో రంగస్థలం మార్పులు తీసుకొచ్చింది. రామ్ చరణ్ అద్భుతంగా నటించిన ఈ మూవీ రోజుకో రికార్డును దాటుకుంటూ పదిరోజుల్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగు పరిశ్రమలో గ్రాస్ పరంగా బాహుబలి తర్వాత స్థానంలో 164 కోట్లతో చిరు ‘ఖైదీ నెం 150’ సినిమా ఉన్నింది. ఈ రికార్డును సైతం రంగస్థలం అధిగమించి ఆశ్చర్య పరిచింది. మరికొన్ని రోజుల్లో ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న భరత్ అనే నేను పై భారీ అంచనాలున్నాయి.

ఇది తప్పకుండా ఖైదీ నెం 150’ సినిమా రికార్డును అధిగమిస్తుందని అందరూ అనుకున్నారు. చిరు ని తప్పకుండా మహేష్ బీట్ చేస్తారని అనుకున్నారు. కానీ అతని తనయుడు రామ్ చరణ్ రంగస్థలంతో కొత్త లక్ష్యాన్ని ఇచ్చారు. అందుకే ఇప్పుడు మహేష్ టార్గెట్ తండ్రి కాదు తనయుడు. తొలిసారి మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ మూవీని డీవీవీ దానయ్య కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఏప్రిల్ 20 న థియేటర్లోకి రానున్న ఈ చిత్రం రంగస్థలం రికార్డులను బీట్ చేస్తుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus