రంగస్థలం డబ్బింగ్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్న రామ్ చరణ్!

  • March 6, 2018 / 01:10 PM IST

రచయిత కథపైన ద్యాస పెట్టాలి.. నటుడు నటపైన ద్యాస పెట్టాలి.. దర్శకుడు దర్శకత్వంపై  ద్యాస పెట్టాలి.. లేకుంటే ప్రేక్షకులు సినిమాని పక్కన పెడుతారు. ఈ విషయం డైరక్టర్ సుకుమార్.. హీరో రామ్ చరణ్ కి ఎప్పుడో తెలుసు.. అందుకే బాగా దృష్టి పెట్టి రంగస్థలం షూటింగ్ ని కంప్లీట్ చేశారు. సినిమా అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని చిత్ర బృందం సంతోషంలో ఉంది. ఎడిటింగ్ పూర్తిచేసుకొని డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. సౌండ్ ఇంజినీర్ చిట్టి బాబు పాత్ర అందరిమనసులో ముద్ర పడాలని పడాలని కట్టు బొట్టు.. నటనలో జాగ్రత్తలు తీసుకున్న చరణ్… యాసపైన కూడా దృష్టిపెట్టారంటా. అతని పాత్ర ప్రతి డైలాగ్ గోదావరి యాసలో ఉండాలని సాధన చేసి మరీ డబ్బింగ్ చెబుతున్నట్టు తెలిసింది.

అందుకే అనుకున్న సమయం కంటే డబ్బింగ్ కి కొన్ని ఎక్కువరోజులు పట్టేట్టు ఉందని టాక్.  అలాగని రిలీజ్ వాయిదా పడుతుందని అభిమానులు కంగారు పడకండి. మార్చి 30 థియేటర్లో తప్పక వస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. చరణ్ సరసన తొలిసారిగా సమంత నటించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అనసూయ, ఆది, జగపతి బాబులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 18 న వైజాక్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ధృవ వంటి హిట్ తర్వాత చరణ్ చేసిన ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus