రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకోనున్న రామ్ చరణ్ సినిమా

  • December 29, 2017 / 10:53 AM IST

ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలకాకముందే నెక్స్ట్ సినిమా షూటింగ్ ని చరణ్ మొదలెట్టనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలుకానుంది. అందుకు తగ్గట్టు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆర్టిస్టుల సెలక్షన్ దాదాపు ఫైనల్ అయిందని సమాచారం. ఇందులో విలన్ గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ని తీసుకున్నారు.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్ పేరును పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటికివచ్చింది. ఈ కథ రాజస్థాన్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. దాదాపు 70 శాతం షూటింగ్‌ను రాజస్థాన్ లో, మిగిలిన 30 శాతం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరిస్తారని సమాచారం. ఇందులో రాజ వంశస్థుడుగా చరణ్ కనిపిస్తారని టాక్. బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలకు ఏమాత్రం కొదవ ఉండదని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎస్.ఎస్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus