పవర్ స్టార్ తర్వాత బాలయ్య.. అటు తరువాత మెగా ఫ్యామిలీ?

  • July 26, 2020 / 08:00 AM IST

ఉదయ కిరణ్ బయోపిక్ ఎప్పటి నుండో వార్తల్లో ఉంటూనే ఉంది. మొదట డైరెక్టర్ తేజ.. ఉదయ కిరణ్ బయోపిక్ ను తెరకెక్కిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అతను చెయ్యను అని చెప్పేసాడు. అటు తరువాత సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరోలు ఉదయ కిరణ్ బయోపిక్ లో నటిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో కూడా నిజం లేదు అని ఆ హీరోలే తేల్చి చెప్పేసారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఉదయ కిరణ్ బయోపిక్ ను రాంగోపాల్ వర్మ తెరకెక్కించనున్నాడనేది తాజా వార్త.

ఇక్కడ ఉదయ్ కిరణ్ పై సానుభూతితోనో.. అతని పై జాలితోనో కాదు.. ఉదయ కిరణ్ బయోపిక్ ను అడ్డం పెట్టుకుని ‘మెగా ఫ్యామిలీ’ ని బ్యాడ్ చెయ్యడం కోసం వర్మ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అవును ఇప్పటికే.. ‘పవర్ స్టార్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చ గొట్టి వారి ఎమోషన్స్ తో ఆడుకుంటూ క్యాష్ చేసుకుంటున్న వర్మ.. తరువాత మెగా ఫ్యామిలీని టార్గెట్ చెయ్యబోతున్నట్టు టాక్.

మధ్యలో బాలయ్య బాబుని కూడా ఓ చూపు చూస్తాడట. 2004లో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల నేపధ్యంలో ఓ చిత్రం చెయ్యడానికి కూడా వర్మ రెడీ అవుతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అది పూర్తయ్యాక ఉదయ్ కిరణ్ ను అడ్డం పెట్టుకుని మెగా ఫ్యామిలీని కెలికే విధంగా వర్మ ట్రై చేస్తున్నాడని స్పష్టమవుతుంది. ఉదయ కిరణ్ పతనానికి మెగా ఫ్యామిలీనే ప్రధాన కారణం అన్నట్టుగా ఆ చిత్రంలో చూపించబోతున్నాడు వర్మ అనే ప్రచారం జరుగుతుంది.

1

2

3

4

5

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus