భారీ ఆఫర్ అందుకున్న రాశీ ఖన్నా

  • February 20, 2018 / 01:10 PM IST

ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా అందం, అభినయం తో పాటు నవ్వించ గలిగిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ‘సుప్రీమ్’ లో ఆమె కామెడీ టైమింగ్ తో కేక పుట్టించింది. ‘హైపర్’లో ఎనర్జిటిక్ హీరో రామ్ స్పీడ్ అందుకొని రాశీఖన్నా తన జోరు చూపించింది. జై లవకుశలో ఎన్టీఆర్ కి జోడీగా నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. రీసెంట్ గా తొలిప్రేమలో మూడు షేడ్స్ చూయించి అందరితో ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాదిని మంచి హిట్ తో ప్రారంభించింది. అలాగే భారీ ఆఫర్ ని అందుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. బాహుబలి తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాని తీయబోతున్నారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆర్టిస్టుల సెలక్షన్ చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరిగా రాశీఖన్నాను సెలక్ట్ చేసినట్లు తెలిసింది. అది కూడా ఆమె చరణ్ కి జోడీగా కనిపించబోతున్నట్లు టాక్. ఇది వరకు రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నా హీరోయిన్ గా ఎంపికైంది. కానీ చివరి నిముషంలో ఆ స్థానాన్ని సమంత కొట్టేసింది. అప్పుడు బాధ పడ్డ రాశీ ఖన్నా ఈ ఛాన్స్ తో ఆనందంగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus