మహేష్ బాబు పై రష్మిక మందన కామెంట్స్..!

  • December 12, 2019 / 07:06 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జనవరి 11న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, మరియు రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక.. మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

రష్మిక మాట్లాడుతూ.. ” మహేష్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన లాంటి సూపర్ స్టార్ తో కలిసి డ్యాన్స్ చేసేందుకు కొంచెం ఇబ్బంది పడ్డాను. భయం వేసింది కూడా..! చిత్రీకరణకు వచ్చే ముందు మాత్రమే ఆయన స్టెప్పులు నేర్చుకునేవారు. ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు .. పాటలో యాక్టివ్ గా కనిపించడానికి.. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. సినిమా సెట్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయంలో మహేష్ గారే నాకు స్ఫూర్తి’.. అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus