మొదటిసారి వెండితెరపై అందాలు ఆరబోసేందుకు సిద్ధమవుతోంది

  • October 24, 2019 / 04:26 PM IST

పూజా హెగ్డే తర్వాత అగ్ర కథానాయకి స్థానం కోసం పోటీపడుతున్న వారిలో రష్మిక మండన్న ముందు స్థానంలో ఉంది. ఆల్రెడీ.. అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగచైతన్యలతో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న ఈ అమ్మడు.. ఇప్పటివరకూ సరైన గ్లామర్ రోల్ మాత్రం ప్లే చేయలేదు. “డియర్ కామ్రేడ్”లో అమ్మడి పెర్ఫార్మెన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. ఈసారి తన అందాల ప్రదర్శనతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది రష్మిక.

మొట్టమొదటిసారిగా మహేష్ బాబుతో జత కట్టే అవకాశం రావడంతో.. “సరిలేరు నీకేవ్వరు” చిత్రంలో తన గ్లామర్ డోస్ ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఈ సినిమాలో రష్మిక టాకీ పార్ట్ పూర్తైంది. మహేష్ బాబుతో రెండు పాటలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ రెండు పాటల్లోనూ తన గ్లామర్ ను కాస్త ఘాటుగానే ఆడియన్స్ ను రుచి చూపించడానికి సన్నద్ధమవుతోంది రష్మిక. మరి రష్మిక గ్లామర్ షోను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి.

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus