సంక్రాంతి పోటీలో గెలిచే భామ ఎవరో?

  • January 6, 2020 / 07:51 PM IST

ఈ సంక్రాంతికి బన్నీ, మహేష్ ల మధ్య గట్టి పోటీనే నెలకొందని… ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. కేవలం హీరోల మధ్యే కాదు.. నిర్మాతలు మధ్య కూడా గట్టి పోటీనే నెలకొంది. ఈ సినిమాలకి సంబంధించిన పోస్టర్స్ మరియు అప్డేట్స్ తో తెగ కొట్టుకుంటున్నారు. ఇక హీరోయిన్ల మధ్య కూడా గట్టి పోటీనే నెలకొందని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోన్న డిబేట్ లను బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును రష్మిక మందన అలాగే పూజా హెగ్దే ల మధ్య కూడా గట్టిపోటీనే నెలకొంది.

ఇప్పటికే పూజా హెగ్దే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించేసింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా నటించడానికి రెడీ అవుతోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా నటించేసి అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. సో ‘అల వైకుంఠపురములో’ సినిమా హిట్ అయితే పూజ క్రేజ్ డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రష్మిక విషయానికి వస్తే.. ఓ స్టార్ హీరోతో నటించడం ఆమెకు ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ, నాని వంటి ‘టైర్ 2’ హీరోల సరసనే నటించింది. ఈమె పై ‘గోల్డెన్ లెగ్’ అనే ముద్ర కూడా ఉంది. కానీ ఇప్పుడు మహేష్ తో పాటు బన్నీ సరసన కూడా ఓ సినిమా చేస్తుంది. ముందుగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ అయితే ఈమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ ఇద్దరి హీరోయిన్లలో ఎవరు గెలుస్తారనేది చూడాలి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus