మాస్ మహారాజ ఒకేసారి రెండు సినిమాల్లో!

  • August 22, 2016 / 09:20 AM IST

గత సంవత్సరం ‘బెంగాల్ టైగర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఈ సంవత్సరం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేదు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా మొదలు పెట్టినా.. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొన్నామద్య బాబీ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేస్తాడనే మాటలు వినిపించాయి. అయితే ఈ సినిమాతో పాటు ఆయన మరో సినిమా కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది.

విక్రమ్,దీపక్ అనే ఇద్దరు దర్శకులు చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వారిద్దరు కలిసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. అలానే బాబీ సినిమా కూడా ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు మన మాస్ మహారాజ. రెండు నెలల గ్యాప్ లో ఒకదాని తరువాత మరొకటి విడుదల చేయాలనుకుంటున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో తన ఆబ్సెన్స్ ను మర్చిపోయేలా చేస్తాడేమో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus