సాయి ధరమ్ తేజ్ తో అనసూయ ఐటెం సాంగ్ చేయడం వెనుక బలమైన కారణం

  • November 14, 2016 / 12:12 PM IST

సినీ స్టార్స్ తో సమానంగా అభిమానులను కలిగి ఉన్న యాంకర్ అనసూయ. అందాలతో మత్తెక్కించే  ఈ భామకి జబర్దస్త్ షో మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పట్లో సినిమా ఆఫర్లు ఎన్ని వచ్చినా సున్నితంగా తిరస్కరించిన ఈ నటి సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కింగ్ నాగార్జున తో ఆడి పాడింది. క్షణం సినిమాలోనూ బాగా నటించి పేరుతెచ్చుకుంది. ఇప్పుడు వెండి తెరపై అందాలను ఆరబోయడానికి సిద్ధమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ‘విన్నర్‌’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయనుంది.

ఇందుకోసం 12 కిలోల బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ గతవారం ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ పరిసరాల్లో అనసూయ, తేజుపై పాటను చిత్రీకరించారు. అనసూయ విన్నర్ టీమ్ తో ఉన్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసం ఐటెం సాంగ్ వదులుకున్న మీరు.. సాయి ధరమ్ తేజ్ తో ఒకే చెప్పడానికి కారణం ఏమిటని విలేఖరులు అనసూయను ప్రశ్నించగా .. అందుకు ఆమె స్పందిస్తూ “ఈ పాట అనసూయ.. అనసూయ మొదలవుతుంది.నా పేరుతో మొదలవ్వడమే కాకుండా, ఎంతో హుషారుగా ఉంటుంది అందుకే ఒకే చెప్పాను” అని వివరించింది. ఈ పాట సినిమాలో ఒక హైలెట్ కానుందని చిత్ర బృందం భావిస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus