జై లవ కుశ ఆడియో వేడుక క్యాన్సల్ కి కారణం ఇదే

  • August 31, 2017 / 06:26 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభమైతే విడుదలయ్యేవరకు.. సినిమాకి సంబంధించిన ప్రతి సందర్భాన్ని అభిమానులు వేడుకలా చేసుకుంటారు. అలాంటింది బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న జై లవ కుశ మూవీ ఆడియో వేడుకను నిర్వహించడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీనిపై నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడారు. ”ఆడియో వేడుక భారీ ఎత్తున నిర్వహిద్దామనుకొన్నాం. కానీ ఓ వైపు గణేష్ నిమిజ్జనం, మరో వైపు వర్షాలు..  అందుకే అభిమానుల భద్రతని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 3 న సీడీల్ని నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాం.” అని స్పష్టం చేశారు.

ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ “అత్యుత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించిన చిత్రమిది. తమ్ముడు ఎన్టీఆర్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది” అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 10న విడుదల చేస్తారు. ఎన్టీఆర్ తొలిసారి త్రి పాత్రాభినయం చేసిన ఈ మూవీలో రాశీఖన్నా, నివేదా థామస్‌, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ సెప్టెంబర్ 21న థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus