ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ కి అసలు కారణం?

  • August 27, 2016 / 07:00 AM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డుల ప్రభంజనానికి రంగం సిద్దం అయ్యింది. వేట మొదలు పెట్టడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. అయితే అదే క్రమంలో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ తో ఉన్నారు. ఎలా అయినా ఈసినిమాను హిట్ గా నిలపాలి అని ఎన్టీఆర్ విశ్వప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న తరుణంలో అనుకోని సెంటిమెంట్ ఒకటి జనతా గ్యారేజ్ పై సరికొత్త టెన్షన్ రేపుతుంది. విషయంలోకి వెళితే….నిన్ననే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, అయితే టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది అని న్యూస్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త పోస్టర్స్ లో ‘ఈరోస్’ సంస్థ సింబల్ చూడగానే కంగారు పడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు ఎందుకంటే….ఈ సంస్థ ఎన్టీఆర్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది.

అయితే అదే క్రమంలో ఈ సంస్థ యొక్క గత రికార్డులు చూస్తే చాలా బాలేని పరిస్థితి. మహేష్ బాబు “1 – నేనొక్కడినే” దగ్గర్నుంచి మొదలుపెడితే మొన్న వచ్చిన పవర్ స్టార్ “సర్ధార్ గబ్బర్ సింగ్” వరకూ వాళ్లు విడుదల చేసిన సినిమాలు అన్నీ దారుణమైన ఫలితాలనే ఇచ్చాయి. దీంతో సెన్సార్ పూర్తయిన వెంటనే విడుదలయిన పోస్టర్ లో వరల్డ్ వైడ్ రిలీజ్.. ఈరోస్ సంస్థ అని ప్రకటన రావడంతో ఒక్క సారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొత్త కంగారు మొదలైందట. అయితే వినడానికి విచిత్రంగా అనిపించినా ఇలాంటి సెంటిమెంట్స్ విషయంలో సినిమా వాళ్ళు కాస్త సీరియస్ గానే ఉంటారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus