ఎన్టీఆర్ వల్లే మురళీధరన్ మార్పు!!

  • May 17, 2017 / 07:06 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ ఫ్యాన్స్ కి ఒకరకంగా చెప్పాలి అంటే దేవుడు, ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ చూస్తే షాక్ అవాల్సిందే. అయితే అలాంటి ఎన్టీఆర్ కి కరియర్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం, ఎంత ప్రయత్నించిన ఒకానొక దశలో హిట్ అందుకోలేకపోవడం ఎన్టీఆర్ ను చాలా కలవర పెట్టాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఆ తరువాత వరుస హిట్స్ తో దుమ్ము దులిపేస్తున్నాడు అనుకోండీ, అది వేరే విషయం. వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ హిట్ అనుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సొంత అన్న కల్యాణ్ రామ్ నిర్మాణంలో, బాబీ దర్శకత్వంలో ‘జైలవకుశ’ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుందనే విషయం తెలిసిందే. అదే క్రమంలో ఈ సినిమా విషయం ఈమధ్య టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఈ మూవీకి సంబంధించిన విషయంలో ఓ కీలక మార్పు జరగడమే.

అయితే ఆ గొడవ ఏంటి,ఎందుకు జరిగింది అనే న్యూస్ ఇప్పటికే తెలిసిన తరుణంలో అసలు ఈ గొడవకు కారణం ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇండస్ట్రీలో కొత్తగా టాక్స్ వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ గా సీకే మురళీధరన్ స్థానంలో మరొక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడును తీసుకున్న విషయం తెలిసిందే. దానికి కారణం ఏంటి అంటే సినిమా అవుట్ పుట్ కి సంబంధించిన విషయంలో హ్యాపీగా లేని జూనియర్ ఎన్టీఆర్ ఈ మార్పును చూశారని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్వాలిటీ విషయంలో, జూనియర్ హ్యాపీగా లేడంట. దీని గురించే గతంలో సినిమాటోగ్రాఫర్ మురళీధరన్ తో కొంత చర్ఛలు నడిచాయి. అయితే ఇవి రోజు రోజుకి ఎక్కువుగా మారటంతో ఫైనల్ గా జూనియర్ సినిమాటోగ్రాఫర్ ని మార్చాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దీంతో జై లవకుశ మూవీ తాజా షెడ్యూల్స్ కి సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు పని చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే అదీ మ్యాటర్. ఏది ఏమైనా ఎన్టీఆర్ సొంత నిర్మాణం కాబట్టి సినిమా విషయంలో ఆమాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా?


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus