తనపై వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చిన రెజీనా!

  • October 17, 2017 / 10:00 AM IST

నటసింహ బాలకృష్ణ  గౌతమి శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ సినిమాని అత్యంత వేగంగా పూర్తి చేసి ఔరా అనిపించారు. పైసా వసూల్ తర్వాత  కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 102 వ సినిమాని చేస్తున్నారు. నయన తార ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో సినిమాకు సంబంధించి భారీ ఫైట్ షూట్ చేశారు. ఈ షెడ్యూల్ తో సినిమా దాదాపు 60 శాతం కంప్లీట్ అయినట్టే. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ గా రెజీనా ను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది.

ఈ చిత్రంలో ఇప్పటికే నయనతార తో పాటు నటాషా, హరిప్రియ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాలుగో హీరోయిన్ గా రెజీనా ఎంపిక అయిందని వార్త షికారు చేసింది. ఈ వార్తలను రెజీనా కొట్టి పడేసింది. బాలకృష్ణ 102 సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ బ్యూటీకి తెలుగు కలిసి రాకపోవడంతో తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇవి హిట్ అయితే  కోలీవుడ్ లో రెజీనా స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus