సైన్స్ తెలిస్తే.. కనీసం సెన్స్ తెలిసుండేది : రేణూ దేశాయ్

  • December 30, 2019 / 06:43 PM IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి పవన్ అభిమానుల పై మండిపడింది. రేణూ పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత తన ఇద్దరి పిల్లలతో వేరుగా జీవిస్తుంది. అయితే పిల్లలకి సంబందించిన ప్రతీ వేడుకల విషయాల్లోనూ పవన్ తో కలుస్తూనే ఉన్నారు. తన పిల్లలు అకీరా, ఆద్య ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది రేణూ. ఇప్పుడు కూడా వాళ్ళకి సంబందించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో అఖీరా తన చెల్లి ఆద్యను ఎత్తుకుని ఉన్నాడు.

అయితే ఈ ఫోటో చూసిన ఓ నెటిజెన్.. ‘ఎంతైనా పవన్ రక్తం కదా’ అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్ కు రేణూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘టెక్నికల్ గా వారిద్దరిలోనూ ప్రవహించేది నా రక్తం.. మీకు కొంచెం సైన్స్ తెలిసున్నా ఆ సెన్స్ తెలిసుండేది’ అంటూ జవాబిచ్చింది. ఇది చూసిన మరో నెటిజెన్.. ‘అభిమానులతో ఇంత దురుసుగా మాట్లాడతారా?’ అంటూ ప్రశ్నించగా.. ‘అభిమానులైతే మాత్రం.. అమ్మతనం గురించి దురుసుగా మాట్లాడొచ్చా’ అంటూ ప్రశ్నించింది. గతంలో కూడా అఖీరా ను జూ.పవర్ స్టార్ అంటూ పవన్ అభిమానులు కామెంట్ చేస్తే.. ‘అఖీరా ను జూ.పవర్ స్టార్ అని పిలిస్తే.. అస్సలు నచ్చదు’ అంటూ కామెంట్స్ చేసింది. ‘ఏదేమైనా అఖీరా హీరో గనుక అయితే… కచ్చితంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ నే దృష్టిలో ఉంచుకోవాలి… ఈమాత్రం దానికి అభిమానులను చులకన చేయడం ఎందుకు’ అంటూ ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus