బోయపాటి, రామ్ చరణ్ టీమ్ లో జాయిన్ అయిన కొత్త డీఓపీ

  • October 24, 2018 / 09:24 AM IST

రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ “‘అజర్ బైజాన్”లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ కి వచ్చిన చిత్ర బృందం రెస్ట్ తీసుకోకుండానే వైజాగ్ లో షూటింగ్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో కూడా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఈ మూవీ సాంకేతిక విభాగంలో మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రిషీ పంజాబీ తప్పుకోవటంతో కొత్త కెమెరామేన్‌ను తీసుకున్నట్టుగా ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

రిషీ తప్పుకోవడానికి కారణాలు ఏంటో తెలియరాలేదు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. మిగిలి ఉన్న టాకీ పార్ట్‌తో పాటు రెండు పాటలకు విల‍్సన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. రాజవంశస్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి అన్నయ్యలుగా ప్రశాంత్‌, నవీన్‌ చంద్ర, ఆర్యన్ రాజేష్ నటిస్తున్నారు. చెర్రీ కి వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజలు కనిపించనున్నారు. విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఓబరాయ్ పోటీపడుతున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus