‘ఆర్.ఆర్.ఆర్’ సెకండ్ షెడ్యూల్ షురూ..!

  • January 21, 2019 / 10:25 AM IST

‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా నిరూపించాడు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం….. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం కారణంగా కాస్త గ్యాప్ ఏర్పడింది.

ఇక ఆ వివాహ పనులన్నీ… పూర్తి చేసి జనవరి 21న రెండో షెడ్యూల్ ను మొదలు పెట్టాడు జక్కన్న. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్‌ ను చిత్రీకరిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్ ల పై వచ్చే కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్ ను కూడా వేయడం విశేషం.

రాజమౌళి చిత్ర షూటింగ్ అంటే కనీసం రెండు,మూడు సంవత్సరాలైనా టైం పడుతుందని అందరూ అనుకుంటారు. అయితే ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేసి ఆ ఆలోచనని అందరిలో నుండీ చెరిపేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. ‘బాహుబలి’ చిత్రం మాదిరి ఏమాత్రం గ్యాప్ లు ఇవ్వకుండా ఇద్దరి హీరోల నుండీ బల్క్ డేట్స్ తీసుకున్నాడట జక్కన్న. 2019 అక్టోబరులోగా షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడట. ఇక ఈ చిత్రాన్ని 2020లోనే విడుదల చేయాలనుకుంటున్నాడట. ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే రాజమౌళి చిత్రాలకి సంగీతం అందించే ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు, మిగతా నటీ నటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus