‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

  • March 6, 2019 / 05:04 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం గత కొంత కాలంగా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం హైదరాబాద్ లో వేసిన ఒక స్పెషల్ సెట్ లో రెండు షెడ్యూల్స్ ని జరుపుకుంది. ఇప్పుడు మొదటి సారి ఈ చిత్ర షూటింగ్ పక్క రాష్ట్రాలకి వెళ్ళనుందట. దీనికి సంబందించిన పనులు కూడా చక చకా జరిగిపోతున్నాయట. రాజమౌళి అండ్ టీం ఈ షెడ్యూల్ కోసం అతి త్వరలో పక్క రాష్ట్రాలకి పయనించనున్నారని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

ఇక ఈ మూడో షెడ్యూల్ ను 40 రోజుల పాటూ కలకత్తాలో షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేశారట. విరామం లేకుండా ఈ ఇద్దరు హీరోలు అలాగే మరికొంత మంది నటీనటులతో ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్ళీ హైదరాబాద్ షెడ్యూల్ కి తిరిగి వస్తారట. అగ్ర నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ మరియు మిగిలిన నటీనటుల గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ను త్వరలోనే బాలీవుడ్ మీడియాకు పరిచయం చేయాలనీ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. చరణ్ ఇంతకుముందే ‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమయ్యాడు కాబట్టి… ఇప్పుడు తారక్ ని కూడా బాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus