క్రేజీ సీక్వెల్ లో హీరోయిన్ గా ‘ఆర్.ఎక్స్.100’ బ్యూటీ..?

  • February 2, 2019 / 05:33 AM IST

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రంలో తన గ్లామర్ షో తో పాటు, నటనతో కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించడంలో పాయల్… కీలక పాత్ర ఉందని చెప్పడంలో సందేహం లేదు. అందులోనూ మొదటి చిత్రంతో హిట్టవ్వడంతో కీలక పాత్ర పోషించడమంటే … ఇది చాలా అరుదనే చెప్పాలి… అటువంటి ఫీట్ ను పాయల్ సాధించింది. ఇక ‘ఎన్టీఆర్- కథానాయకుడు’ చిత్రంలో కూడా ఓ పాత్రలో మెరిసింది.

అయితే… అలంటి క్రేజ్ సంపాదించుకున్న తరువాత పాయల్ కు వరుస ఆఫర్లు రావడం ఖాయమనుకున్నారంతా… అయితే ఆ రేంజ్ లో పాయల్ కు ఆఫర్లు రాలేదనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం.. పాయల్ కు వచ్చే ఆఫర్లన్నీ కూడా గ్లామర్, మరియు బోల్డ్ జోనర్లకు సంబందించిన ఆఫర్లే వస్తున్నాయట. అలా వచ్చిన ఆఫర్లని పాయల్ రిజెక్ట్ చేయడంతో.. తను ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. ఇక పాయల్ చేతిలో మాస్ మహా రాజ్ సరసన ‘డిస్కో రాజా’ చేస్తున్న చిత్రం ఒకటే ఉంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. దీనితో పాటు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో పాయల్ కి అవకాశం లభించేలా ఉందని తెలుస్తుంది. ‘చి ల సౌ’ చిత్రంతో డైరెక్టర్ గా మారిన యాక్టర్.. రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం అక్కినేని నాగార్జున తో ‘మన్మథుడు’ చిత్ర సీక్వెల్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయిపొయింది. ప్రస్తుతం ఈ సీక్వెల్ కి నటీనటులను ఎంపిక చేసే పనిలో రాహుల్ బిజీగా ఉన్నాడట. ఇందులో భాగంగా పాయల్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సీక్వెల్ లో పాయల్ ను ఎంచుకుంటే… పాయల్ జాక్ పాట్ కొట్టేసిందని చెప్పొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus