‘సేవ్ నల్లమల’ అంటున్న మెగా మేనల్లుడు

  • September 13, 2019 / 06:27 PM IST

ప్రస్తుతం ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు మెగామేనల్లుడు సాయి తేజ్. ఇప్పుడు తేజ్ మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాటలో నడుస్తున్నాడు. అయితే అది సినిమాల విషయంలో కాదండోయ్..! సామజిక బాధ్యత విషయంలో..! అసలు విషయం ఏమిటంటే… తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. మేము యురేనియం తవ్వకాన్ని ఎంత మాత్రం ఒప్పుకోమని… కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి, జనసేన పార్టీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి. ఇక సినీపరిశ్రమ నుండీ కూడా వీరికి మద్దతు పలుకుతుండడం విశేషం. ఆ విషయంలో విజయ్ దేవరకొండ యురేనియం తవ్వకం విషయమై ఘాటు వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు మెగామేనల్లుడు సాయి తేజ్ కూడా అదే విధంగా వ్యాఖ్యలు చేశాడు.

సాయితేజ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయం పై స్పందిస్తూ… ‘ఎక్కడో ఉన్న అమెజాన్ అడవులు కాలిపోతుంటే మనం బాధపడ్డాం. మరి మనం ఇప్పుడేం చేస్తున్నాం? రండి.. మన ప్రకృతిని కాపాడుకుందాం. ‘సేవ్ నల్లమల’ ‘ అంటూ ట్వీట్ చేశాడు తేజు. దీంతో సాయితేజ కు కూడా కొంతమంది మద్దతు పలుకుతూ కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు.

1

2

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus