ఇంటెన్స్ డైరెక్టర్ చెప్పిన కథను ఒకే చేసిన సాయితేజ్

  • June 22, 2019 / 12:47 PM IST

అరడజను డిజాస్టర్ల అనంతరం సాయిధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్ కి దక్కిన హిట్ “చిత్రాలహరి”. ఈ సినిమా ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీతో సాయితేజ్ మంచి ప్రొజెక్ట్స్ సైన్ చేస్తూ ఇదివరకటిలా ఫాస్ట్ గా కాకుండా చాలా నింపాదిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ మారుతి దర్శకత్వంలో “ప్రతి రోజు పండగ” అనే సినిమా సైన్ చేసిన సాయితేజ్ ఆ సినిమా కోసం సరికొత్త లుక్ ట్రై చేయడంలో కాస్త బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా.. ఒక హీరోయిన్ గా తన చివరి సూపర్ హిట్ ఫిలిమ్ “సుప్రీమ్”లో తనకు జంటగా నటించిన రాశీఖన్నాను ఒక హీరోయిన్ గా ఫైనల్ కూడా చేశాడు తేజ్.

మారుతి సినిమా తర్వాత దేవ కట్టాతో మరో సినిమా సైన్ చేసినట్లు తాజా సమాచారం అందుతోంది. “డైనమైట్” అనే డిజాస్టర్ అనంతరం మరో సినిమా సైన్ చేయని దేవ కట్టా బాహుబలి యానిమేషన్ సిరీస్ కు దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇటీవలే దేవా కట్ట మన సుప్రీమ్ హీరోకి మంచి ఇంటెన్సిటీ ఉన్న స్టోరీ ఒకటి చెప్పాడట. సాయి తేజ్ కి కూడా కథ బాగా నచ్చడంతో.. కథ పూర్తి చేయమని చెప్పాడట. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుంది అనే విషయం ఇంకా క్లారిటీ లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus