మహర్షి మూవీలో విలన్ గా సీనియర్ ఆర్టిస్ట్

  • November 24, 2018 / 11:35 AM IST

భరత్ అనే నేను తరువాత మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు కాగా, దిల్ రాజు, అశ్వని దత్, పీవీపీ సంస్థ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన భారీ విలేజ్ సెట్ లో జరుగుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా ,హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా లో విలన్ ఎవరు అనేది ఇంతవరకు చిత్ర బృందం బయటకి రానివ్వలేదు .

అయితే సోషల్ మీడియా లో వినిపిస్తున్న వైరల్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా లో విలన్ మరెవరో కాదు సాయి కుమార్ అని, ఇంతకు ముందు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన “ఎవడు” సినిమా లో కూడా సాయి కుమార్ ఏ మెయిన్ విలన్ గా నటించాడు. ఆ సెంటిమెంట్ కారణంగానే మళ్ళీ సాయి కుమార్ నే విలన్ గా సెలెక్ట్ చేసి ఉంటారని సమాచారం.సెంటిమెంట్సి ని బాగా నమ్మే సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటివి మామూలే. సెంటిమెంట్సి ని బాగా నమ్మే సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటివి మామూలే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus