‘ఫిదా’తో సాయి పల్లవికి టాలీవుడ్ లో భారీ అవకాశాలు

  • July 24, 2017 / 03:42 PM IST

‘ఫిదా’లో భానుమతిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ప్రేక్షకులకు పక్కింటమ్మాయి ఫీలింగ్ తెచ్చేశాయి. తెలుగులో సొంతంగానే డబ్బింగ్ చెప్పుకొని.. తన సహజ నటనతో మంత్రముగ్ధులను చేసింది. ఒక్కసారిగా ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో సాయి పల్లవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే నాని హీరోగా రూపొందుతున్న MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) చిత్రంలో నటిస్తోన్న సాయి పల్లవి, రన్‌ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, శతమానం భవతి… ఇలా వరుస హిట్స్‌తో జోరుమీదున్న శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జంటగా సాయిపల్లవిని అనుకుంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus