విడాకులు తీసుకున్న డైరెక్టర్ తో సాయిపల్లవిపెళ్ళి..?

  • March 26, 2019 / 04:56 PM IST

చెప్పుకోవడానికి స్టార్ హీరోలతో ఏమీ నటించలేదు. పెద్దగా అందాల ఆరబోత చేయదు. అయినప్పటికీ తెలుగు .. తమిళ భాషల్లో హీరోయిన్ సాయిపల్లవికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడం సాయి పల్లవి స్టైల్. కమర్షియల్ చిత్రాల్ని పక్కన పెట్టి కేవలం కథా బలం ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ.. తన పాత్రకి ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వస్తుంది మలయాళీ బ్యూటీ. పాత్ర తరువాతనే పారితోషికం గురించి ఆలోచించే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే సాయిపల్లవి ఓ తమిళ దర్శకుడితో ప్రేమలో ఉందంటూ తాజాగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఆ దర్శకుడిని పెళ్ళి చేసుకోబోతుందని కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇంతకీ సాయి పల్లవి ప్రేమలో ఉన్న ఆ దర్శకుడు ఎవరో కాదు .. అమలా పాల్ మాజీ భర్త అయిన ఏ.ఎల్.విజయ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘కణం’ అనే చిత్రం తెరకెక్కింది. తెలుగుతో పాటూ తమిళ్ లో కూడా విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఓ మంచి వైవిధ్యభరితమని అలాగే సాయిపల్లవి నటన అద్భుతమనే మంచి మార్కులు విమర్శకుల దగ్గర్నుండీ దక్కాయి. ఇక ఈ చిత్ర షూటింగు సమయంలోనే ఈ హీరోయిన్, డైరెక్టర్ మధ్య ప్రేమ పుట్టిందనీ .. ఇప్పుడు బలపడిందని టాక్ వినిపిస్తుంది. పెళ్ళి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా సాయిపల్లవి అభిమానులు మాత్రం ఇది కేవలం గాసిప్ అని కొట్టిపారేస్తున్నారు. ‘అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి చెప్పిన మాటలను కూడా వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus