సరికొత్త పాత్రలో నటించబోతున్న సాయి పల్లవి..!

  • January 28, 2019 / 01:11 PM IST

‘ఫిదా’ చిత్రంలో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది సాయి పల్లవి. ఆ చిత్రంలో ‘వచ్చిండే’ అనే ఇప్పటికీ యూట్యూబ్లో మారు మోగుతూనే ఉంది. నిజానికి ఈ చిత్రం కంటే ముందే సాయి పల్లవికి ఫ్యాన్స్ ఉన్నారు. మలయాళం రాకపోయినా సరే.. సాయి పల్లవి నటన కోసం చాలా మంది తెలుగు ప్రేక్షకులు ‘ప్రేమమ్’ చిత్రాన్ని తేగ చూసారు. ఇక ‘ఫిదా’ చిత్రం తరువాత సాయి పల్లవికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. తను నటిస్తుందంటే సినిమాకి మంచి హిప్ క్రియేట్ అవుతుందనే చెప్పాలి. తాజాగా ‘మారి 2’ చిత్రంలో ‘రౌడీ బేబీ’ పాటతో మరోసారి యూట్యూబ్ ను షాక్ చేస్తుంది సాయి పల్లవి. ఇదిలా ఉండగా ఈ అమ్మడు త్వరలో గన్ పట్టుకోబోతుందట.

 

వివరాల్లోకి వెళితే.. ‘నీదీ నాదీ ఒకే కథ’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించి హిట్టందుకున్న.. వేణు ఉడుగుల డైరెక్షన్లో రానా హీరోగా ‘విరాటపర్వం’ అనే చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో రానా సరసన నటించబోతున్న సాయి పల్లవి సరికొత్త పాత్రలో దర్శనమివ్వబోతుందట. వివరాల్లోకి వెళితే… ఈ చిత్రంలో ఆమె నక్సలైట్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకూ క్లాస్ పాత్రలు చేస్తూ పోతున్న సాయి పల్లవి ఈ చిత్రంలో నక్సలైట్ పాత్రలో ఎలా ఆకట్టుకోబోతుందో చూడాలి..! ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో… సూర్య సరసన ‘ఎన్.జి.కె చిత్రంలో నటిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus