Samantha: దానికి ఇదే రైట్ టైం.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

  • December 30, 2022 / 11:37 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా మాయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈమె సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం లేదు. గతంలో కొంచెం సమయం దొరికినా సోషల్ మీడియాలో గడిపేది. అభిమానులతో చాట్ చేసేది. అయితే ఈ మధ్య అలా చేయడం లేదు. గత నెలలో ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత… ఆ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

మూడు నెలల నుండి ఆమె మాయోసైటిస్ తో బాధపడుతుంటే.. కరెక్ట్ గా సినిమా రిలీజ్ కు ముందు మాత్రమే రివీల్ చేసి సింపతీ గెయిన్ చేసుకుంది సమంత. అయినప్పటికీ ఆమె ప్రమోషన్లలో పాల్గొంది. హాస్పిటల్ ఉండి మరీ డబ్బింగ్ చెప్పింది. ‘ఫ్యామిలీ మెన్’ లో సమంత పెర్ఫార్మన్స్ ను ‘యశోద’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చూసే అవకాశం లభించింది. ఇదిలా ఉండగా.. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది.

తన లేటెస్ట్ పిక్ ని షేర్ చేసి మరో రెండు రోజుల్లో 2022 కి గుడ్ బై చెప్పబోతున్న సందర్భంగా సమంత ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇక సమంత… ‘ మీరు ఏం చేయగలరో అదే చేయండి. దేనినైతే నియంత్రించాలి అనుకుంటున్నారో దానినే నియంత్రించండి. కొత్త, సులభమైన లక్ష్యాల ఛేదనకు ఇదే సరైన సమయం. మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను.

మీరు తీసుకునే రిజల్యూషన్ కు కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023..’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు.. ‘నూతన సంవత్సరంలో మీ ఆరోగ్యం పూర్తిగా నయం కావాలని కోరుకుంటున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus