Samantha: వేలూరు గోల్డెన్ టెంపుల్ లో సందడి చేసిన సమంత!

  • July 17, 2023 / 05:03 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నటిగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించే టాప్ హీరోయిన్ గా ఉన్నారు. అయితే గత కొన్ని నెలల క్రితం సమంత మయూసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇలా ఈ వ్యాధికి గురైనటువంటి సమంతా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి చికిత్స తీసుకున్నారు.

ఈ వ్యాధి నుంచి కోలుకోగానే ఈమె తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. అయితే ఈ వ్యాధి పూర్తిగా నయం కాలేదని ఇంకా తనని వెంటాడుతున్నటువంటి క్రమంలో సమంత తన సినిమాలన్నింటినీ పూర్తి చేసుకుని ఏకంగా ఏడాది పాటు విరామం ప్రకటించారు.త్వరలోనే ఈమె అమెరికా వెళ్లి ఈ వ్యాధికి సరైన చికిత్స తీసుకొని క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని తన హెయిర్ స్టైలిస్ట్ కూడా తెలియజేశారు.

మరి కొద్ది రోజులలో (Samantha) సమంత చికిత్స కోసం అమెరికా వెళ్లబోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తూ కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. అయితే సమంత తాజాగా వేలూరు గోల్డెన్ టెంపుల్ లో సందడి చేశారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా సమంత చికిత్స కోసం అమెరికాకు వెళుతున్న నేపథ్యంలో తనకు ధైర్యం ప్రసాదించమని కోరుతూ సమంత ఇలా ఆలయాలను సందర్శిస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాతో పాటు ఈమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus