జూ.ఎన్టీఆర్ హీరోయిన్.. తల్లి కాబోతుందట..!

  • February 13, 2019 / 06:21 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటి సమీరా రెడ్డి చాలా రోజుల తరువాత వార్తల్లోకెక్కింది! ‘మైనే దిల్ తుజ్ కో దియా’ అనే చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సమీరారెడ్డి. మన తెలుగు ప్రేక్షకులకి కూడా ఈమె సుపరిచితమే… జూ.ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’ ‘అశోక్’, మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతే కాదు ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో వెంకీ,రానా లతో ఓ పాటకి స్టెప్పులేసింది కూడా.

ఇక పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది సమీరా రెడ్డి. మరి అంతా బాగానే ఉంది కదా…! మరి సమీరా రెడ్డి ఎందుకు వార్తల్లోకి ఎక్కింది అనేగా మీ డౌట్..? అదేం లేదండి… తాజాగా సమీరా రెడ్డి గర్భవతి అయ్యినట్టు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించింది. ఈ ఫోటోతో పాటు ‘నిన్ను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నా బేబీ’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది సమీరా. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. 2014లో సమీరా రెడ్డి … అక్షయ్ వాద్రాని ని వివాహం చేసుకుని సెటిల్ అవ్వగా.. 2015లో ఆమె ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి ఆమె తల్లి కాబోతుండడం విశేషం. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus