సగం షూటింగ్ అవ్వకుండానే మహేష్ సినిమాకి భారీ ఆఫర్..!

Advertisement

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘సర్కారు వారు పాట’. విజయ్ దేవరకొండ తో ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉండబోతుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ ఇంకా సగంలో సగం కూడా అవ్వకుండానే భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.35కోట్ల భారీ ఆఫర్ వచ్చింది. కానీ నిర్మాతలు ఇంకా దానిని ఫైనలైజ్ చెయ్యలేదు. ఎందుకంటే ఇంకా దానికి మించిన ఆఫర్లు వస్తున్నాయట. ఇదిలా ఉంటే.. తాజాగా ‘సర్కారు వారి పాట’ చిత్రానికి నైజాం హక్కుల నిమిత్తం భారీ ఆఫర్ వచ్చిందట. ఏకంగా ఒక్క నైజాం రైట్స్ రూపంలోనే రూ.35కోట్ల భారీ ఆఫర్ వచ్చిందట. మహేష్ బాబు గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ని..

అక్కడ రూ.25కోట్లకు విక్రయించగా.. ఫుల్ రన్లో ఆ చిత్రం రూ.37కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. అయితే మామూలు టైంలో స్టార్ హీరో సినిమా విడుదలైతే రూ.20 నుండీ రూ.25 కోట్ల మధ్యలోనే అక్కడ బిజినెస్ జరుగుతుంది. కానీ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు మాత్రం నైజాం రైట్స్ కు భారీ డిమాండ్ ఉంటుంది. ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా 2022 సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది కాబట్టి.. అంత పెద్ద మొత్తం పలుకుతున్నట్టు సమాచారం. అలా అని ఈ ఆఫర్ ను కూడా నిర్మాతలు ఆ రేటుకి ఫైనల్ చెయ్యలేదని వినికిడి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus