సరైనోడు ట్రైలర్ అదిరింది!

  • April 11, 2016 / 10:32 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న మాస్ ఎంటర్టైనర్ ‘సరైనోడు’. ఈ సినిమాపై మొదటినుండి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా సినిమా టీజర్ ను రిలీజ్ చేసి ఆ అంచనాలను కాస్త మరింత పెంచారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కథను రివీల్ చేయకుండా చాలా ఆసక్తికరంగా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ సీన్స్ ను ప్రధానంగా చేసుకొని ఒకటిన్నర నిమిషం పాటు ఈ ట్రైలర్ నడిచింది. ”ఎదుటోడితో పెట్టుకోవడానికి కావాల్సింది… బ్రాండ్ కాదు. దమ్ము.. ఇక్కడ టన్నుల కొద్ది ఉంది చూస్తావా..? అంటూ బన్నీ వేసే మాస్ డైలాగ్ అదిరింది. ఎనీ టైం, ఎనీ వేర్, ఎనీ బడీ.. నేను రెడీ అంటోన్న ఈ ‘సరైనోడు’ ఏప్రిల్ 22న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus