ఇరవై ఏళ్ల అమ్మాయితో బాలయ్య రొమాన్స్!

  • November 10, 2020 / 01:52 PM IST

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బాలయ్య సినీ కెరీర్లో సూపర్‌హిట్లుగా నిలవడంతో ఈ సినిమా కూడా సక్సెస్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ముందుగా మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను తీసుకున్నారు. ఈ జంటకి స్క్రీన్ టెస్ట్ చేయగా..

బాలయ్య పక్కన ప్రయాగ సూట్ అవ్వలేదని ఆమెని ప్రాజెక్ట్ నుండి తప్పించారు. ఇప్పుడు ఆ స్థానంలో నటి సాయేషా సైగల్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘అఖిల్’ సినిమా తరువాత సాయేషా కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడే వరుస అవకాశాలు రావడంతో నటిగా బిజీ అయిపోయింది. కోలీవుడ్ హీరో ఆర్యని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. పెళ్లి అయినప్పటికీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో అంగీకరించింది.

అయితే సాయేషా వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. ఈ ఇరవై ఏళ్ల బ్యూటీ అరవై ఏళ్ల హీరో సరసన నటిస్తుండడంపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్కినేని అఖిల్ లాంటి యంగ్ హీరోతో రొమాన్స్ చేసిన సాయేషా బాలయ్య లాంటి సీనియర్ హీరో పక్కన నటిస్తుండడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరి వెండితెరపై ఈ జంట ఎలా ఉంటుందో చూడాలి. త్వరలోనే సయేశా ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus