చైతూ తో సరికొత్త ప్రయోగం చేస్తున్న శేఖర్ కమ్ముల

  • June 29, 2019 / 07:11 PM IST

‘మజిలీ’ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత హిట్టందుకున్నాడు చైతూ. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో మంచి జోష్ లో తన తదుపరి చిత్రాల్ని మొదలు పెట్టాడు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు చైతూ. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇక ఈ చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు నాగ చైతన్య. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ‘ఫిదా’ తరువాత సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కాబట్టి మంచి క్రేజ్ ఏర్పడింది.

‘ఫిదా’లో సాయిపల్లవి తో తెలంగాణ యాస పలికించి ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ ను చేసాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు చైతూ తో కూడా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పించబోతున్నాడట. ఇందుకోసం చైతూ ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడట. ఇప్పటి వరకూ తాను చెయ్యని పాత్ర కాబట్టి చైతూ కూడా మంచి ఆసక్తి కనపరుస్తున్నాడట. నాగ చైతన్యకు ఇది 20వ సినిమా కావడం విశేషం. ఇక తెలంగాణ యాసలో చైతూ ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus