‘మహానటి’ దర్శకుడితో శ్రుతీ హాసన్ ఏం చేసిందంటే?

  • September 25, 2020 / 12:24 PM IST

శ్రుతీ హాసన్, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కింది. డిజిటల్ వరల్డ్ కోసం వీళ్ళిద్దరూ కలిసి పని చేశారు. అది నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే… బాలీవుడ్ డైరెక్టర్లు నలుగురు తీసిన ‘లస్ట్ స్టోరీస్’ ఓటీటీ వరల్డ్‌లో బంపర్ హిట్ అయ్యింది. తెలుగులో ఆ తరహా సిరీస్ చెయ్యడానికి నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేసింది.

డైరెక్టర్లు నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి ఒక్కో స్టోరీని డైరెక్ట్ చేశారు. మరో స్టోరీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్‌గా అనుకున్నారు. ఇప్పుడు ఆ స్టోరీ షూటింగ్ కంప్లీట్ చేసినట్టు వున్నారు. తెలుగులో టైటిల్ చేంజ్ చేస్తారని టాక్. నాగ్ అశ్విన్ కూడా అక్షరాలు రివర్స్ లో రాసి వున్న ‘X life’ లోగో షేర్ చేశారు. “ఐదు రోజుల్లో అసాధ్యం కాదని అనుకున్నదానిని పూర్తి చేశాం. చెయ్యగలమనే నమ్మకంతో పని చేసిన మా టీమ్ అందరికీ థాంక్యూ.

మల్టీ టాలెంటెడ్, గూఫీ, జార్జియస్ శ్రుతీ హాసన్ కి థాంక్స్. ఆమె ఏం చేసిందో ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను” అని నాగ్ అశ్విన్ అన్నారు. కరోనా నేపథ్యంలో శ్రుతీ హాసన్, నాగ్ అశ్విన్, మిగతా టీమ్ మెంబర్లు అందరు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశారు. నటీనటులు మినహా మిగతా అందరూ ఎప్పుడూ మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించారట.

1

2

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus