చరణ్ కి వదినలుగా నటించేది వీరే

  • January 23, 2018 / 09:24 AM IST

ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కొన్ని సీన్లు రీషూట్ చేయాలనీ సుకుమార్ కోరడంతో చరణ్ అందుకు సహకరిస్తున్నారు. ఈ నెలాఖరితో రంగస్థలం షూటింగ్ కంప్లీట్ కానుంది. వెంటనే చెర్రీ బోయపాటి శ్రీను సినిమాని పట్టాలెక్కించనున్నారు. వీరిద్దరికలయికలో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ చిత్రంలో అలనాటి నటి, బాపు బొమ్మ స్నేహ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రోల్ ఏమిటో బయటికి వచ్చింది. రామ్ చరణ్ కి వదినగా నటిస్తున్నట్టు తెలిసింది. ఆమె మాత్రమే కాకుండా మరో ముగ్గురు చరణ్ కి వదినులుగా కనిపించనున్నారు.

అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజ, ప్రవీణలు చరణ్ కి వదినులుగా నటించనున్నారని సమాచారం. ఈ నలుగురితో చరణ్ కి ఉండే సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకుల వెంట కన్నీళ్లు తెప్పిస్తాయని చిత్ర బృందం తెలిపింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా ఖరారైన ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ భయపెట్టనున్నారు. ఎక్కువ భాగం రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో చరణ్ రాజా వంశస్థుడిగా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus