రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా

  • April 19, 2018 / 02:07 PM IST

నందమూరి హీరోలకు ఫ్యాక్షన్ కథలకు మంచి అనుబంధం ఉంది. ఆ నేపథ్యంలో సాగే కథలు బాలకృష్ణకి, ఎన్టీఆర్ కి మంచి హిట్స్ ఇచ్చాయి. తారక్ కెరీర్ ని మలుపు తిప్పిన ఆది చిత్రం కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలోనే సాగుతుంది. రాయలసీమలో ఎన్టీఆర్ చేసిన హంగామా.. ఇంతా అంతా కాదు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాక్షన్ కథలు చేసినప్పటికీ అంతగా విజయం సాధించలేదు. దీంతో అటువైపు వెళ్ళలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ రాయలసీమలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతను చేస్తున్న సినిమా కుటుంబ కథ చిత్రమని, మిలిటరీ కథని కొంతకాలం క్రితం వరకు రూమర్లు చక్కర్లు కొట్టాయి.

అయితే అవేవి నిజం కాదని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అందుకు కారణం రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్న భారీ పల్లెటూరి సెట్. నాలుగు కోట్లతో నిర్మితమవుతున్న ఈ సెట్ రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన సెట్ అని తెలిసింది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని టాక్. సెట్.. యాక్షన్ సీక్వెన్స్.. ఈ రెండు కారణాలు.. ఇది ఫ్యాక్షన్ సినిమా అని  చెప్పకనే చెబుతోందని అంటున్నారు. త్రివిక్రమ్ ఫ్యాక్షన్ కథను కొత్తగా ఆవిష్కరిస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ కథ గురించి చిత్ర బృందం ఎటువంటి లీకులు ఇవ్వడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus