ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో విలేజ్ సెట్

  • April 17, 2018 / 06:12 AM IST

అజ్ఞాతవాసి తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ గతవారం మొదలయింది. భారీ ఫైట్ సీక్వెన్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు.  జై లవకుశ చిత్రం తర్వాత చేస్తున్న ఈ చిత్రం కోసం తారక్ పదికిలోల బరువు తగ్గారు. జిగేల్ రాణి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి ఓ విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా కోసం రామోజీ పిలింసిటీలో భారీ సెట్ వేస్తున్నారు.

రాయ‌ల‌సీమకు చెందిన ఓ గ్రామం  సెట్‌ ని  దాదాపు రెండెక‌రాల్లో నిర్మిస్తున్నారు. ఈ సెట్ పనులు పూర్తికావచ్చాయి. ఈ సెట్ మ‌ధ్య‌లో ఓ పెద్ద స‌ర‌స్సు కూడా ఉంటుందని తెలిసింది. ఈ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే భారీ ఫైట్ సీక్వెన్స్‌  కూడా ఇక్కడే తీయనున్నారని ఫిలిం నగరవాసులు చెప్పారు. కేవలం ఈ సెట్ కోసం 4 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. వచ్చే నెలలో ఈ భారీ షెడ్యూల్ మొదలుకానుంది. ఎస్.ఎస్.థమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. తొలిసారి త్రివిక్రమ్ నందమూరి హీరోతో చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus